గంటా శ్రీనివాసరావు పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన వైవి సుబ్బారెడ్డి..
విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో గెలిచిన గంటా శ్రీనివాసరావు కనిపించడం లేదు అంటూ వైవి సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. గెలిచాక బాధ్యతలు చేపట్టాల్సిన వ్యక్తి మాయమైతే.. ప్రజలకు అండదండగా నిలిచి ఓటమిని అధిగమించి వారి కష్టసుఖాల కోసం నిరంతరం పనిచేసిన కేకే రాజుని ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్నారని ఆయన అన్నారు. జరగబోయే ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కేకే రాజుకు ప్రజల తమ మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు. బాలయ్య శాస్త్రి లేఔట్ వద్ద రాజు ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వై వి సుబ్బారెడ్డి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ సర్వమత సౌభ్రాతృత్వాన్ని కాపాడుతుంది అనేదానికి నిర్వచనం గా పార్టీ కార్యాలయం ప్రారంభానికి ముందు.. ఈ దరఖాస్తు తో పాటు ఆ లెటర్ ని పంపించాలి. అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థనలు జరిపారు. అనంతరం మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి గంటా చేసింది ఏమీ లేదని.. కాబట్టి ఈసారి ప్రజలు పనిచేసే నేతనే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు..