ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నూతన గవర్నర్ నజీర్ కు సీఎం జగన్ స్వాగతం

నూతన గవర్నర్ నజీర్ కు సీఎం జగన్ స్వాగతం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జిస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌కు ముఖ్యమంత్రి సాదర స్వాగతం పలికారు. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, ఆయన కటుంబ సభ్యులు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను సీఎం శాలువాతో సత్కరించారు. అనంతరం ఇంటర్నేషనల్‌ టెర్నినల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన  ప్రత్యేక వేదిక వద్దకు జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం జగన్‌ చేరుకున్నారు. అక్కడ శాసన మండలి చైర్మన్‌ మోషన్‌ రాజు, మంత్రి జోగి రమేశ్‌, ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు, కృష్ణా జిల్లా కెక్టర్‌ పి. రంజిత్‌భాషా, ఎస్పీ పి. జాషువా, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ టి.కె.రాణా, ఇతర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, పలువురు న్యాయమూర్తులు జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు స్వాగతం పలికారు. అనంతరం విజయవాడలోని రాజ్‌భవన్‌కు చేరుకున్న జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, ఆయన కుటుంబ సభ్యులకు గవర్నర్‌ ప్రత్యేక కార్యదర్శి అనిల్‌  కుమార్‌ సింఘాల్‌, ఇతర అధికారులు స్వాగతం పలికారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :