అందరి చూపు విరూపాక్ష పైనే!
టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా చప్పగా సాగుతోంది. పేరుకైతే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ కనీసం అవి యావరేజ్ మూవీలుగా కూడా అనిపించుకోలేకపోతున్నాయి. టాలీవుడ్ బాక్సాఫీస్ కు చివరి హిట్ అంటే దసరా అనే చెప్పుకోవాలి. ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ అందులో సగం రిజల్ట్ కూడా అందుకోకపోగా డిజాస్టర్లుగా మిగులుతున్నాయి.
ఏప్రిల్ మొదటి వారంలో వచ్చిన మాస్ మహారాజా రవితేజ మూవీ రావణాసుర, కిరణ్ అబ్బవరం మీటర్ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. బయ్యర్లకు తీవ్ర నష్టాలు తప్పలేదు. రీసెంట్గా రిలీజైన శాకుంతలం సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దీంతో అందరి దృష్టి వచ్చే వారం రిలీజ్ కానున్న విరూపాక్ష మీద ఉంది.
సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ విలేజ్ ఫాంటసీ థ్రిల్లర్ తో కార్తీక్ దండు డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. టాలీవుడ్ లక్కీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ ఈ సినిమాలో కాస్త గ్లామర్ డోస్ పెంచి మరీ నటించింది. సరిగ్గా ఈ టైమ్ని తేజు వాడుకుంటే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం. గ్రామాల్లో ఉండే మూఢనమ్మకాలు ప్రాణాల మీదకు ఎలా తెస్తాయనే విభిన్నమైన పాయింట్ తో ఈ సినిమాను రూపొందించారు. మరి విరూపాక్ష ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.