విరాట్ దంపతులకు అయోధ్య ఆహ్వానం
దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం మరి కొద్ది రోజుల్లో రానుంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం ప్రారంభోత్సవానికి మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిర్వాహకులు ఆహ్వానాలు అందించే ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. ఇప్పటికే రాజకీయ, వ్యాపార, సినీ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానాలు అందిన విషయం తెలిసిందే. తాజాగా టీంఇండియా పరుగుల రారాజు విరాట్ కోహ్లీ దంపతులకు కూడా ఆహ్వానం అందింది. నిర్వాహకులు స్వయంగా కోహ్లీ, అనుష్క ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
Tags :