భారత్ బయోటెక్ ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
తెలంగాణ రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన భారత్ బయోటెక్ సంస్థను దేశ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆయన సతీమణి సుదేశ్ ధన్ఖడ్తో కలిసి సందర్శించారు. సంస్థ ఆవరణంలో ఉన్న ఔషధ మొక్కలకు ఉపరాష్ట్రపతి, గవర్నర్ రాధాకృష్ణన్ నీళ్లు పోశారు. సవాళ్ల సమయంలో సంస్థ అంకిత భావాన్ని స్థితిస్థాపకతను కొనియాడారు. సంస్థ పరిశోధనలు, తయారు చేస్తున్న వ్యాక్సిన్ల గురించి భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా, ఎండీ సుచిత్ర ఎల్లా వివరించారు. సంస్థ సేవలను ఉప రాష్ట్రపతి మెచ్చుకున్నారు. పరిశ్రమ, విద్యాసంస్థలు తదితర అన్ని రంగాలలో మరింత పరిశోధనలకు మద్దతునిచ్చేలా సహకారం అందించాలని కోరారు.
Tags :