ఉచితాలపై వెంకయ్య నాయుడు విమర్శ..
ఎన్నికల్లో విజయం సాధించడం లక్ష్యంగా పెట్టుకున్న దాదాపు అన్ని పార్టీలు ప్రజలకు ఉచిత హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉచితాలు ఇచ్చి ప్రజల దగ్గర ఓట్లు గుంజుకోవాలని ఎత్తులు వేస్తున్న పార్టీలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఘాటుగా స్పందించారు. ఎలక్షన్ లో గెలవడం కోసం నాయకులు ప్రజలకు ఇవ్వాలి అనుకుంటున్న ఉచితాలు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసే విధంగా ఉండకూడదు అని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాలలో ఇష్టానుసారంగా హామీలు ఇవ్వడం వల్ల.. భవిష్యత్తు ప్రణాళికలపై భారీ ప్రభావం పడుతుందని ఆయన స్పష్టం చేశారు. వైద్యం, విద్య ఉచితంగా ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు అన్న వెంకయ్య నాయుడు..అప్పులు చేసి మరి ఉచితాలు ఇవ్వడం సబబు కాదు అని అన్నారు.
Tags :