లోక్ సభ ఎన్నికల బరిలో వీరప్పన్ కుమార్తె
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యారాణి వీరప్పన్ తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు. ఆమెకు సినీ దర్శకుడు నామ్ తమిళర్ కట్చి(ఎస్టీకే) కన్వీనర్ సీమాన్ కృష్ణగిరి సీటు కేటాయించారు. నాలుగేళ్ల క్రితం విద్యారాణి బీజేపీలో చేరినప్పటికీ ఆమెకు ఎలాంటి పార్టీ పదవులు ఇవ్వలేదు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. దీనితో ఆమె బీజేపీకి రాజీనామా చేసి, ఎన్టీకే పార్టీలో చేరారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్టీకే పార్టీ రాష్ట్రంలోని 39 లోక్సభ స్థానాలతో పాటు పుదుచ్చేరిలోని లోక్సభ స్థానం నుంచి కూడా పోటీ చేస్తోంది. చెన్నైలో జరిగిన సభలో సీమాన్ 40 మంది అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు. వీరిలో 20 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.
Tags :