రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన గాయత్రి రవి
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను గాయత్రి రవి సమర్పించారు. నామినేషన్ దాఖలు కంటే ముందు గన్పార్క్లోని అమరవీరుల స్థూపానికి రవి నివాళులర్పించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బండా ప్రకాష్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకకు రవి నామినేషన్ దాఖలు చేశారు.
Tags :