గత 20 ఏళ్లతో పోల్చుకుంటే 2023లోనే అధికం : అమెరికా
అమెరికాకు వలస వచ్చిన వారి సంఖ్య గత 20 ఏళ్లతో పోల్చుకుంటే 2023లోనే అధికమని యూఎస్ సెన్సస్ బ్యూరో వెల్లడించింది. దేశ జనాభా పెరుగుదలకు ఈ పరిణామం ఉతమిచ్చిందని పేర్కొంది. ఈ ఏడాది దేశ జనాభాలో 16 లక్షల మంది చేరగా వారిలో రెండొంతుల మంది వలసల ద్వారానే వచ్చినట్టు తెలిపింది. వీరితో కలిపి మొత్తం జనాభా 33.5 కోట్లకు చేరిందని బ్యూరో వివరించింది. కొవిడ్ తగ్గుముఖం పట్టడం తద్వారా మరణాల సంఖ్య తగ్గడమూ దీనికి కారణమని పేర్కొంది. వలసలను అనుమతించకపోతే 2030 ద్వితీయార్ధంలో అమెరికాలో జననాల కంటే మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి.
Tags :