హైదరాబాద్ లో అమెరికా కాన్సులేట్ నూతన కార్యాలయం ప్రారంభం
అమెరికా, భారత్ సంబంధాల బలోపేతంలో హైదరాబాద్లో నిర్మించిన నూతన కాన్సులేట్ కార్యాలయం నూతన అధ్యాయాన్ని ఆవిష్కరిస్తుందని భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ పేర్కొన్నారు. రాయబారిగా బాధ్యతలు చేపట్టిన తరవాత తొలిసారిగా ఆయన హైదరాబాద్కు వచ్చారు. నానక్రాంగూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో నిర్మించిన నూతన కాన్సులేట్ కార్యాలయాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అమెరికా 247వ స్వాతంత్య్ర వేడుకలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు సేవలను అందించేందుకు ఇక్కడ కాన్సులేట్ ఏర్పాటు చేశాం. నూతన భవన నిర్మాణానికి రూ.340 మిలియన్ డాలర్లు వెచ్చించాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ ఔసఫ్ సయీద్ పాల్గొన్నారు.