నిన్న అమెరికా, నేడు ఐరాస
భారత్ సహా ఎన్నికలు జరగనున్న అన్ని దేశాల్లో ప్రజల రాజకీయ, పౌర హక్కులకు రక్షణ ఉంటుందని భావిస్తున్నామని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అన్నారు. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం ఉంటుందని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు, కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయటంలో భారత్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను మీడియా ప్రస్తావించగా డుజారిక్ పై విధంగా స్పందించారు. కేజ్రీవాల్ అరెస్టుపై ఇప్పటికే జర్మనీ, అమెరికా సైతం స్పందించిన విషయం తెలిసిందే.
Tags :