ఐరాసలో తెలంగాణ యువకుడి ప్రసంగం
ఐక్యరాజ్యసమితి 55వ మానవహక్కుల మండలి సమావేశంలో భారత్ తరపున వికారాబాద్ జిల్లాకు చెందిన సాయిసంపత్ పాల్గొన్నారు. స్విట్జర్ల్యాండ్లోని జెనీవాలో ఈ నెలలో ప్రపంచ మానవ హక్కుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్నట్లు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం బద్లాపూర్ గ్రామానికి చెందిన మెట్టు సాయిసంపత్ తెలిపారు. రెండు వారాల పాటు జరిగిన ఈ మీట్లో వాతావరణ మార్పు ఆహార భద్రత అనే అంశంపై ప్రసంగించినట్లు తెలిపారు. విదేశీ కలుపు మొక్కల నియంత్రణపై ప్రపంచ దేశాలు అనుసరించాల్సిన అంశాలపై సూచనలు, అభిప్రాయాలు వెల్లడిరచానని తెలిపారు. తాను ఈకోఫాన్ స్వచ్చంద సంస్థ తరపున పర్యావరణ పరిరక్షణ, జంతు రక్షణ వంటి సామాజిక అంశాలపై పని చేస్తున్నట్లు తెలిపారు.
Tags :