కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు
నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ను బరిలో దింపుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరిట ప్రకటన విడుదల చేశారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ఈ స్థానానికి తుది ఓటరు జాబితాను వెలవరించగా, మొత్తం 4.61 లక్షల మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.
Tags :