శరత్ కుమార్ కీలక నిర్ణయం
లోక్సభ ఎన్నికల ముంగిట తమిళనాట కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ సినీనటుడు ఆర్.శరత్ కుమార్ తన పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి బీజేపీలో విలీనం చేశారు. తన పార్టీ ఆఫీస్ బేరర్లతో పాటు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో కాషాయ పార్టీలో విలీనం చేసిన విషయాన్ని ప్రకటించారు. చెన్నైలో పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఐక్యతతో పాటు ఆర్థిక వృద్ధిని సాధించే దిశగా ప్రధాని మోదీ ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతం చేసి యువత సంక్షేమానికి భరోసాగా నిలుస్తున్నారని కొనియాడారు. 2026లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని తన పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
Tags :