ASBL NSL Infratech

వైభవంగా ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

వైభవంగా ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయం వెనుకవైపు గల వసంతోత్సవ మండపంలో గత మూడురోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు కన్నుల పండువగగా ముగిశాయి. తొలిరోజు, రెండవరోజు శ్రీమలయప్పస్వామి వారు తన ఉభయదేవేరులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొనగా చివరిరోజున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పతో పాటుగా శ్రీ కృష్ణ స్వామి వారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండువగా సాగింది.  మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఒకే వేదికపై సమస్త మూలవర్లను దర్శించిన భక్తులు తన్మయంతో పులకించారు. అదేవిధంగా ప్రతినెలా పౌర్ణమినాడు తిరుమలలో నిర్వహించే గరుడసేవను టీటీడీ రద్దు చేసింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :