భద్రాచలంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు ఆరంభం
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామ నవమి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం వైభవంగా నిర్వహించారు. దీంతో నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ఆరంభమైనట్లు స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్ తెలిపారు. ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాన్ని గరుడమూర్తికి ఆరగింపు చేసి భక్తులకు అందించారు. దేవతలంతా వచ్చి సీతారాముల కల్యాణం వీక్షించాలని దేవతాహ్వానం పలికారు. నేడు ఎదుర్కోలు ఉత్సవం ఉంటుందని ఈవో రామాదేవి తెలిపారు. 30న కల్యాణం, 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం ఏర్పాట్లపై దేవదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్, కలెక్టర్ అనుదీప్ సమీక్షించారు.
Tags :