పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం... దాదాకు జెడ్ కేటగిరీ
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ భద్రత విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వై కేటగిరీలో ఉన్న దాదాకు జెడ్ కేటగిరీగా మార్చినట్లు సీనియర్ అధికారులు పేర్కొన్నారు. గంగూలీకి మంగళవారంతో వై కేటగిరి భద్రత గడువు ముగియడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వీవీఐపీ సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం గంగూలీకి వై కేటగిరి భద్రత ముగిసింది. దీంతో ఆయనకు జెడ్ కేటగిరీలోకి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని సదరు అధికారులు వెల్లడిరచారు. కొత్త సెక్యూరిటీ విధానం ప్రకారం 8 నుంచి 10 మంది వ్యక్తిగత భద్రతా అధికారులు గంగూలీకి సెక్యూరిటీ ఇస్తారు. ప్రస్తుతం గంగూలీ ఢల్లీి క్యాపిటల్స్తో ఉన్నారు. మే 21న కోల్కతాకు చేరుకుంటారు. అప్పటి నుంచి ఆయన జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ప్రారంభమవుతుంది.