మైత్రీతో సీతారామమ్ డైరెక్టర్ భారీ సినిమా!
సీతారామమ్ సినిమాతో మళ్లీ అందరి చూపు ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్న దర్శకుడు హను రాఘవపూడి. ఈ సినిమా ద్వారా టాలీవుడ్కి క్లాసికల్ని అందించిన హను అందాల రాక్షసి అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమై, మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత కృష్ణ గాడి వీర ప్రేమ గాథ పేరుతో సినిమా తీసి బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాడు. మూడో సినిమాగా నితిన్ తో లై అనే సినిమాను చేశాడు. రిలీజ్ కు ముందు సినిమాపై మంచి బజ్ ఉన్నప్పటికీ సినిమా ఊహలకు అందని విధంగా డిజాస్టర్ అయింది. దీంతో మళ్లీ తనకు అలవాటైన లవ్ స్టోరీ జోనర్లోకి వచ్చి శర్వాతో పడి పడి లేచే మనసు సినిమా చేశాడు. ఈ సినిమాకు బాగుంది అనే టాక్ అయితే వచ్చింది కానీ కమర్షియల్ హిట్ మాత్రం కాలేదు.
దీంతో పడి పడి లేచే మనసు సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని సీతారామమ్ సినిమా చేశాడు హను రాఘవపూడి. దుల్కర్ సినిమా హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరి ఊహలను తలక్రిందులు చేసే విధంగా బ్లాక్ బస్టర్ అయింది. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ ఈ సినిమాతో అందరికీ కలిగింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లో ఈ సినిమాకు సూపర్ టాక్ వచ్చింది. ఓ విధంగా చెప్పాలంటే ఈ సినిమాకు నేషనల్ అవార్డులు సైతం వస్తాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ టైమ్లో తన తర్వాతి సినిమా పీరియాడికల్ జోనర్ లో ఓ లవ్ స్టోరీ ఉంటుందని హను చెప్పాడు. దీంతో పాటూ వైజయంతీ మూవీస్ బ్యానర్లో కూడా ఒక సినిమా హను చేస్తాడని ప్రొడక్షన్ టీమ్ అనౌన్స్ చేసింది. ఆ సినిమా కూడా మృణాల్, దుల్కర్ కాంబోలోనే ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉంటే ఈ క్రేజీ డైరెక్టర్ ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్తో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్తో ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్ లోనే ప్లాన్ చేస్తున్నారట మైత్రీ నిర్మాతలు. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్, కాస్టింగ్ ఖరారయ్యే ఛాన్స్ ఉందని టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.