తెలుగు రాష్ట్రాల భక్తులకు శుభవార్త... శబరిమలలో
శబరిమలలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణం తెలుగు రాష్ట్రాల భక్తులకు వరమని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి అంగీకరించిన ప్రధాని నరంద్రేమోదీకి, కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఏటా కోట్ల సంఖ్యలో శబరిమలను సందర్శించే భక్తులకు విమాన సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను ప్రధానికి వివరించగా, సూత్రప్రాయంగా అంగీకరించారని చెప్పారు. విమానాశ్రయ ఏర్పాటుకుగాను ప్రధాని మోదీ సైట్ క్లియరెన్స్కు ఆమోదం తెలిపారని, ఇంకా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల అనుమతులు రావాల్సి ఉందని వెల్లడించారు.
Tags :