ప్రజలు కష్టాల్లో ఉంటే.. కేసీఆరేమో జాతీయ రాజకీయాలపై
కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం మన దౌర్భాగ్యమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విర్శించారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు కష్టాల్లో ఉంటే కేసీఆర్మో జాతీయ రాజకీయాలపై మంతనాలు జరుపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను పట్టించుకోకుండా ఫిరాయింపు నేతలతో చర్చిస్తున్నారని మండిపడ్డారు. రీడిజైన్ పేరుతో కాళేశ్వరంలో భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు పరాకాష్టగా మిగిలిందన్నారు. వరద ముంపుతో కాళేళ్వరం అతలాకుతలమైందని, పంప్ హౌస్లన్నీ నీట మునిగిపోయాయని తెలిపారు. పంప్ హౌస్లు మునిగి పోవడంలో ప్రభుత్వం తప్పిదం లేదని పెంటారెడ్డి అనే ఇంజనీర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణం లోపం వల్లే పంప్హౌస్లలోకి నీళ్లు వచ్చాయని ఆరోపించారు.
లక్షల ఎకరాల్లో పంటలు మునిగితే సీఎం కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే టీఆర్ఎస్ పని సగం అయిపోయిందని, ఇంగో సంగం మరో ఆరు నెలల్లో చచ్చిపోతుందని జోస్యం చెప్పారు. గోదావరిలో ఇసుకు దోపిడీ జరగకుంటే ఇంత ముంపు ఉండేది కాదన్నారు. వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి కేంద్రానికి నివేదిక పంపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి రూ.2వేల కోట్ల సహాయం ప్రకటించాలని కోరారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో ఆసుపత్రి పాలైతే కేటీఆర్ ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు.