టిఎల్సిఎ బోర్డ్ అధ్యక్షురాలిగా రాజి కుంచం
న్యూయార్క్లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టిఎల్సిఎ) కొత్త బోర్డ్ ఏర్పాటైంది. బోర్డ్ అధ్యక్షురాలిగా రాజి కుంచెం బాధ్యతలు చేపట్టారు. రెండు దశాబ్దాల తరువాత టిఎల్సిఎ బోర్డ్కు మహిళ నాయకత్వం వహిస్తున్నారు. కార్యదర్శిగా రావు వోలేటి వ్యవహరించనున్నారు. వైస్ చైర్మన్ గా నాగేంద్ర గుప్తా, ట్రెజరర్గా తిరుమలరావు తిపిర్నేని వ్యవహరించనున్నారు. 2024 సంవత్సరానికి గాను ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్గా కిరణ్ రెడ్డి పర్వతాల, వైస్ ప్రెసిడెంట్గా సుమంత్ రామ్ సెట్టి, సెక్రటరీగా మాధవి కోరుకొండ, ట్రెజరర్గా శ్రీనివాస్ సనిగెపల్లి, జాయింట్ సెక్రటరీగా అరుంధతి అడుప, జాయింట్ ట్రెజరర్గా భగవాన్ నడింపల్లి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా సునీల్ చల్లగుల్ల, కరుణ ఇంజపూరి, దివ్య దొమ్మరాజు, లావణ్య అట్లూరి, సుధ మన్నవ, ప్రవీణ్ వ్యవహరించనున్న విషయం తెలిసిందే.
https://www.tlca.com/president-chairman-message/