ASBL NSL Infratech

బిలినీయర్స్ జాబితాలో కొత్త వ్యక్తి.. మద్యం అమ్ముతూ అరుదైన ఘనత

బిలినీయర్స్ జాబితాలో కొత్త వ్యక్తి.. మద్యం అమ్ముతూ అరుదైన ఘనత

లిక్కర్‌ మ్యాగ్నైట్‌ డాక్టర్‌ లలిత్‌ ఖైతాన్‌ బిలియనీర్ల జాబితాలో చేరిన కొత్త భారతీయుడిగా నిలిచాడు. 80 ఏళ్ల అతను రాడికో ఖైతాన్‌ కంపెనీ చైర్మన్‌గా ఉన్నారు. ఆ కంపెనీ ఆదాయం 380 మిలియన్ల డాలర్లు. మ్యాజిక్‌ మూమెంట్స్‌ వోడ్కా, 8 పీఎం విస్కీ, ఓల్డ్‌ అడ్మిరల్‌ బ్రాండీ, రాంపూర్‌ సింగిల్‌ మాల్ట్‌ లాంటి బ్రాండ్లను ఆ కంపెనీ నుంచి ఉత్పత్తి చేస్తున్నారు.  ఈ ఏడాది లలిత్‌ ఖైతాన్‌ కంపెనీ షేర్లు 50 శాతం పెరిగాయి. దీంతో అతని స్టేక్‌ 40 శాతం పెరిగింది. ప్రస్తుతం ఆ కంపెనీ విలువ బిలియన్‌ డాలర్లు దాటింది.  అజ్మీర్‌లోని మయో కాలేజీలో, కోల్‌కతాలోని గ్జావియర్‌ కాలేజీలో డాక్టర్‌ ఖైతాన్‌ చదువుకున్నారు. బెంగళూరులో ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశారు. అమెరికాలోని హార్వర్డ్‌ లో మేనేజింగ్‌ ఫైనాన్స్‌ చేశారు. 1972లో డాక్టర్‌ ఖైతాన్‌ తండ్రి జీఎన్‌ ఖైతాన్‌ రాంపూర్‌ డిస్టిల్లరీ కెమికల్‌ కంపెనీని టేకోవర్‌ చేసి డెవలప్‌ చేశారు. సంప్రదాయ మర్వారి ఫ్యామిలీకి చెందిన కుటుంబం వాళ్లది. 2017లో యూపీడీఏ ఆయనకు జీవిత సాఫల్య అవార్డును ప్రకటించింది. డెవలప్మెంట్‌ ప్రాజెక్టులో డాక్టర్‌ ఖైతాన్‌ నిమగ్నమయ్యారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :