భారత్ తో ఆటలొద్దు.. పశ్చిమ దేశాలకు పుతిన్ హెచ్చరిక
భారత్ అనుసరిస్తోన్న విదేశీ విధానంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ప్రశంసలు కురిపించారు. అలా పాటించడం నేటి ప్రపంచంలో అంత సులభం కాదన్నారు. ఆ దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు బయట నుంచి ఆటలు ఆడే ప్రయత్నాలకు భవిష్యత్తు ఉండదన్నారు. రష్యన్ స్టూడెంట్ డే సందర్భంగా కాలినింగ్రాడ్ ప్రాంతంలోని యూనివర్సిటీ విద్యార్థులుతో ముచ్చటించిన పుతిన్ ప్రధాని మోదీని మరోసారి ప్రశంసించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో భారత్ ఒకటి. అది కూడా ప్రస్తుత ప్రధాని మోదీ నాయకత్వం వల్లే. ఆయన సారథ్యంలోనే భారత్ ఇంతటి వేగం పుంజుకుంటుంది. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా మోదీ నిర్ణయాలు తీసుకుంటారని ఊహించడం అసాధ్యం. ఈ క్రమంలో భారత్, ఆ దేశ నాయకత్వంపై రష్యా ఆధారపడవచ్చు అని పుతిన్ పేర్కొన్నారు.
Tags :