బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు.. సర్వం సిద్ధం
బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర రేపు ప్రారంభం కానున్నది..ఈ నేపథ్యంలో కేసీఆర్ యాత్ర కొనసాగించబోయే బస్సుకు తెలంగాణ భవన్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో గులాబీ శ్రేణులు పాల్గొన్నారు. రేపట్నుంచి వరుసగా 17 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నది. మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో ఈ యాత్ర ముగుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలపే లక్ష్యంగా కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. దాదాపు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు.
Tags :