గాజు గ్లాస్ పగిలే కొద్ది పదునెక్కుది.. పృథ్వీరాజ్..
జనసేన నేత..టాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమర్నాథ్ కు ఏం తెలుసని అతన్ని ఐటి మినిస్టర్ చేశారో అర్థం కావడం లేదు అని ఎద్దేవా చేశారు. అతని ఐటి మినిస్టర్ గా కాక చుట్టుపక్కల ఉన్న స్థలాల గురించి వాకబు చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే మంత్రిగా పెట్టుకున్నట్టు ఉంది అని పృథ్వి విమర్శించారు. చపాతీలు చేశాక చేతి నుంచి రాలే గోధుమపిండి ఏరుకునే రకం గుడివాడ అమర్నాథ్ అని పృథ్వి అన్నారు. అంతేకాదు గాజువాకలో అమర్నాథ్ గెలిచే అవకాశం లేదని .. అక్కడ తమ పార్టీ అభ్యర్థికి 70 వేల మెజారిటీ ఖాయమని సవాల్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయాక ప్రజల నుంచి డబ్బులు జుర్రుకున్న వీళ్ళందరూ పారిపోతారని.. అప్పుడే రాష్ట్రానికి ప్రశాంతత వస్తుందని పృథ్వీరాజ్ అన్నారు. జనసేనని పవన్ కళ్యాణ్.. అసెంబ్లీలో తన గలం వినిపించడం ఖాయమని.. పిఠాపురంలో పవన్ని ఓడించడానికి వైసీపీ డబ్బులు నీటిలా ఖర్చు పెడుతోందని.. చెప్పిన పృద్వి.. ఏం చేసినా పవన్ గెలుపుని ఆపలేరు అని ధీమా వ్యక్తం చేశారు. ఉప్మా ముద్రగడ అనే ఒక పెద్ద మనిషి కాపు నేతని అని చెప్పుకుంటూ.. ఆ సామాజిక వర్గాన్ని వాడుకోవడానికి తప్ప దేనికి పనికి రావడం లేదని పృథ్వీ అన్నారు.