ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య కేంద్రం ప్రారంభం
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. యాపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్తో కలిసి స్వరవేద మహామందిర్కు ప్రారంభోత్సవం చేశారు. ఈ కేంద్రంలో ఒకేసారి 20 వేల మంది ధ్యానం చేసుకొనే సౌకర్యం ఉన్నది. వారణాసి నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ధ్యానకేంద్రాన్ని నిర్మించారు. ఆలయ ప్రారంభోత్సవం అనంతరం ఓ ర్యాలీలో పాల్గొని మోదీ ప్రసంగిస్తూ స్వరవేద ఆలయం గురించి ప్రస్తావించారు. అంతకుమందు ప్రధా ఆలయంలో వివాంగం యోగా శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారు. 19వ శతాబ్దానికి చెందని ఆధ్యాత్మిక, యోగా గురువు, పద్యకారుడు సద్గురు దేవ్జీ మహరాజ్కు గుర్తుగా విహంగం యోగ్ సంస్థాన్ ఈ కేంద్రాన్ని నిర్మించింది. కాగా 2021లో ప్రధాని ఒకసారి ఈ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రంలోని మహామందిరంలో సద్గురువు విగ్రహం ప్రతిష్టించారు.