తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 30న రాష్ట్రానికి రానున్నారు. జహీరాబాద్, మెదక్ లోక్సభ స్థానాలకు కలిపి అందోలు అసెంబ్లీ సెగ్మెంట్లోని సుల్తాన్ పూర్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మే 3న నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు కలిపి చౌటుప్పల్ లేదా ఆ సమీప ప్రాంతంలో సభ ఉంటుంది. 4న మహబూబ్నగర్ లోక్సభ స్థానం పరిధిలోని నారాయణపేట, చేవెళ్ల పరిధిలో వికారాబాద్ లేదా మరో ప్రాంతంలో సభ నిర్వహిస్తారు. తర్వాత కూడా మరో రెండు మూడు రోజులు రాష్ట్రంలో ప్రధాని ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రచారం చివరి అంకంలో హైదరాబాద్లో ప్రధాని సభ ఉండేలా కార్యక్రమం రూపొందిస్తున్నారు.
Tags :