ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ప్రధాని నివాసంలో క్రిస్మస్ వేడుకలు

ప్రధాని నివాసంలో క్రిస్మస్ వేడుకలు

ఏసు క్రీస్తు జీవిత సందేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. దయ, సేవాభావం ప్రస్తుత సమాజానికి అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం అందడానికి ఏసుక్రీస్తు పనిచేశారని తెలిపారు. సమ్మిళిత సమాజాన్ని రూపొందించడానికి ఆయన పనిచేశారని కొనియాడారు. ఈ ఆలోచనలు దేశ అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తున్నాయని ప్రధాని అన్నారు. తన నివాసంలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ  ప్రసంగంలో భాగంగా పోప్‌ను కలిసిన సమయాన్ని గుర్తు చేసుకున్నారు. చిరస్మరణీయ క్షణంగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి సామాజిక సామరస్యం, సోదరభావం, వాతావరణ మార్పు, సమ్మిళిత అభివృద్ధి వంటి అంశాలపై చర్చించామని తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :