దీనిపై ఎవరి దగ్గరన్నా సమాచారం ఉంటే.. దానిని తప్పక
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్రలో భారత్ ప్రమేయంపై అమెరికా చేస్తున్న ఆరోపణలపై తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తాము చట్టానికి కట్టుబడే పనిచేస్తామని, దీనిపై ఎవరి దగ్గరన్నా సమాచారం ఉంటే దానిని అందిస్తే తప్పక పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. బ్రిటన్కు చెందిన ఫైనాల్సియల్ టైమ్స్ డైలీతో మోదీ మాట్లాడారు. అమెరికాలో ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూను హత్య చేయడానికి భారత ప్రభుత్వ ఉద్యోగి నిఖిల్ గుప్తా విఫల కుట్ర చేశాడని యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ చేస్తున్న ఆరోపణలపై భారత్ ఒక విచారణ కమిటీని నియమించిందన్నారు.
Tags :