నటుడి కుమార్తె వివాహం.. హాజరైన ప్రధాని మోదీ
మలయాళ నటుడు, బీజేపీ నేత సురేశ్ గోపి కుమార్తె వివాహానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. కేరళ పర్యటనలో ఉన్న ఆయన కొచ్చిలో రోడ్ షో చేపట్టిన అనంతరం త్రిస్సూర్ వచ్చారు. గురువాయూర్ ఆలయంలో కొత్త జంటను ఆశీర్వదించి వారిద్దరికీ వరమాలలు అందించారు. సురేశ్ గోపి కుటుంబం, కొత్త జంటతో మాట్లాడిన మోదీ వారితో ఫొటోలు తీసుకుఆన్నరు. ఈ వేడుకలో మోహన్లాల్, మమ్ముట్టి, తదితర మలయాళ నటులు సందడి చేశారు. వారితోనూ ప్రధాని ముచ్చటించారు. అలాగే మరో 30 జంటలను ఆశీర్వదించారు.
Tags :