ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ప్రతి ఒక్కరూ కీర్తించాల్సిన వ్యక్తి ఆయన

ప్రతి ఒక్కరూ కీర్తించాల్సిన వ్యక్తి ఆయన

ప్రతి ఒక్కరూ కీర్తించాల్సిన వ్యక్తి పీవీ నరసింహారావు అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. పీవీ జయంతి సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ భారత్‌ ఆర్థికంగా శక్తివంతంగా నిలవడానికి పీవీ నరసింహారావే కారణమని పేర్కొన్నారు. భూ సంస్కరణలు తెచ్చి భూమి లేని పేదలకు భూమి ఇచ్చారన్నారు. ప్రపంచ దేశాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి పీవీ సరళీకృత విధానాలే కారణమన్నారు.  మారుమూల గ్రామం నుంచి దేశ ప్రధానిగా ఎదగడంలో ఆయన సేవలు మరవలేనివన్నారు. దివంగత జైపాల్‌ రెడ్డి వీపీ అడుగుల్లో నడిచారన్నారు. తెలంగాణ అభ్యున్నతికి కాంగ్రెస్‌ పాటు పడుతుందన్నారు. వంగర గ్రామంలో పీవీ జ్ఞాపకార్ధం చేపట్టిన పనులు అసంతృప్తిగా జరిగాయని తెలుస్తోందన్నారు. వాటిని త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. పీవీ కుటుంబాన్ని కాంగ్రెస్‌ ఎప్పుడు గౌరవిస్తుందన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :