అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి
అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు ఆగడంలేదు. కొన్ని వారాల క్రితం క్లేవ్ల్యాండ్లో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ మృతి చెందాడు. ఈ విషయాన్ని న్యూయార్క్లోని భారత దౌత్య కార్యాలయం ప్రకటించింది. మేము గత కొంతకాలంగా వెతుకుతున్న మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ ఓహైయోలోని క్లేవ్ల్యాండ్లో మృతి చెందాడు. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు స్థానిక పోలీసులతో మేం సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహాన్ని తరలించడానికి సహాయం చేస్తాం అని పేర్కొంది. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ మార్చి 7వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. అతడు క్లేవ్ల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఐటీ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు.
Tags :