చెన్నైలో మోదీని మోసేస్తున్న లోకేష్..
కోయంబత్తూరులో బీజేపీ అభ్యర్థి అన్నామలై తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి చెన్నైకి వెళ్ళిన లోకేష్ అక్కడ పలు సమావేశాలలో జోరుగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో భారత్ భవిష్యత్తు మోదీతోనే ఉంది అంటూ ఆయన అన్నారు. కుప్పు స్వామికి మద్దతుగా పీలిమేడు ప్రాంతంలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న లోకేష్ తన వాగ్దాటితో అందరినీ ఆకట్టుకున్నారు. మోదీ అంటే ఒక ఆత్మగౌరవం.. ఒక ఆత్మవిశ్వాసం అని ఆయన వర్ణించారు. అంతేకాదు మోదీ మేకర్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా అని యావత్ ప్రపంచం ప్రశంసిస్తోంది అంటూ మోడీని కీర్తించారు. పలు రకాల పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు సంక్షేమం అందే విధంగా కొత్త ఒరవడి సృష్టించిన మోదీ ప్రభుత్వం గురించి వివరించి చెప్పారు. మోదీ ప్రభుత్వం వచ్చిన ఈ 10 సంవత్సరాలలో దేశ ఆర్థిక ముఖచిత్రం మారిపోయిందని.. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మలచడంలో మోదీ పాత్ర చాలా ఉందని లోకేష్ కొని ఆడారు. కోవిడ్ సంక్షోభం సమయంలో కూడా మోదీ నేతృత్వంలో మన దేశం ఎన్నో సమస్యలను అధిగమించిందని లోకేష్ అన్నారు.