ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం .. మాగుంట రాఘవకు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవకు బెయిల్ మంజూరైంది. వైద్య కారణాలతో రాఘవకు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈడీ అధికారులు ఎప్పుడు పిలిచినా చెన్నై లేదా ఢిల్లీ కార్యాలయంలో వారి ఎదుట హాజరు కావాలని కోర్టు ఆయన్ను ఆదేశించింది. చెన్నైకే పరిమితం కావాలన్న న్యాయస్థానం ప్రతి మంగళ, శుక్రవారాల్లో సాయంగ్రం 4 గంటలకు ఈడీ ఎదుట రిపోర్టు చేయాలని సూచించింది. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొదని, పాస్పోర్ట్ను సరెండర్ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
Tags :