క్లీన్ చీట్ వచ్చాకే జోడో యాత్రలో
తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని భువనగిరిఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసుకు రెండు రోజుల క్రితమే రిప్లై ఇచ్చానని తెలిపారు. తారిక్ అన్వర్ అందుబాటులో లేరని తెలిపారు. ప్రస్తుతానికి తన నియోజకవర్గ పనుల కోసం తిరుగుతున్నానని తెలిపారు. షోకాజ్ నోటీసు ఇచ్చినప్పుడు పాదయాత్రలో ఎలా పాల్గొంటానని ప్రశ్నించారు. క్లీన్ చీట్ వచ్చాకే జోడో యాత్రలో పాల్గొంటానని స్పష్టం చేశారు.
Tags :