అదే జరిగితే రాజీనామా చేస్తా....కేసీఆర్ కు కోమిటి రెడ్డి సవాల్..
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో 8 నుంచి 12 సీట్లను తమ పార్టీ గెలుచుకుంటుంది అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దీనిపై తాజాగా స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. అదే జరిగితే పదవికి రాజీనామా చేస్తాను అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి తెలుసుకున్నారు కాబట్టే ప్రజలు ఈసారి కాంగ్రెస్ కి పట్టం కట్టారు అన్న కోమిటి రెడ్డి.. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. తమకు తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలలో 12 కు పైగా స్థానాలు వస్తాయి అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లోని 25 మంది ఎమ్మెల్యేలు తనతో ఇంకా టచ్ లో ఉన్నారని.. తమ పార్టీలోకి వచ్చేస్తామంటే వద్దన్నానని కేసీఆర్ అన్న మాటలపై కూడా కోమిటి రెడ్డి స్పందించారు. తమతో టచ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని.. తాము ఆ పేర్లను ధైర్యంగా వెల్లడిస్తామని.. మరి కేసీఆర్ ఆ పని చేయగలరా అంటూ ప్రశ్నించారు.