ASBL NSL Infratech

బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే..కోదండరాం..

బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే..కోదండరాం..

ప్రధాని నరేంద్ర మోదీ పాలన గురించి ప్రజలలో మిక్స్డ్ టాక్ నడుస్తోంది. కొందరు ఆయన విధానాలను సమర్థిస్తుంటే ..మరికొందరు ఆయన హిందువుల పక్షపాతీ అని ఆరోపిస్తున్నారు. అంతేకాదు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొందరు బాగా సంపాదించారు అన్న టాక్ కూడా ఉంది. తాజాగా ఇదే విషయం పై కాంగ్రెస్ సీనియర్ నేత కూడా ప్రస్తావించారు.

ప్రజల సంపద గురించి తెలియదు కానీ మోదీ హయాంలో అదానీ, అంబానీ మాత్రం బాగా సంపాదించారు అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. ఈ రోజు కర్నూలులోని బిజినేపల్లిలో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్న ఆయన బీజేపీ పై.. మోదీ పై విమర్శలు కురిపించారు. అంతే కాదు తెలంగాణలో కాంగ్రెస్ గెలిచాక నిజమైన ప్రజాపాలన వచ్చిందన్నారు. ఒక రకంగా తీసుకుంటే బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటేనని.. ఇద్దరికీ పెద్ద తేడా లేదని విమర్శించారు.

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :