అమెరికాకు కిమ్ హెచ్చరిక
ఉత్తర కొరియా రూపొందించిన హ్యసాంగ్`18 అనే అధునాతన, శక్తిమంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి మూడో దశ పరీక్షను ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షించారు. అమెరికా ప్రధాన భూభాగంపై దాడి చేయడమే లక్ష్యంగా దీనిని తయారు చేశారు. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ తమ దేశంపై పెరుగుతున్న అమెరికా సైనిక బెదిరింపులను తిప్పికొట్టేందుకు మరింత ప్రమాదకర చర్యలు తప్పవని హెచ్చరించారు. అమెరికా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఉత్తర కొరియా ఎలా స్పందిస్తుందో హ్వసాంగ్`18 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష చూపించిందని కూడా వ్యాఖ్యానించారు.
Tags :