దీని గురించి మేం ముందుగానే.. అమెరికాకు సమాచారం ఇచ్చాం
సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన గగనతల దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ పై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. వీటి గురించి తాము ముందే అమెరికా కు సమాచారం అందించామని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హోయిన్ అమిరాబ్డోల్లాహియాన్ మీడియాతో అన్నారు. పౌర లక్ష్యాలను మేం గురిపెట్టలేదు. వాణిజ్య జనసమూహ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోలేదు. ఈ దాడి ఇజ్రాయెల్ను శిక్షించేందుకే. మమ్మల్ని రక్షించుకునేందుకు మేం తీసుకున్న చర్య ఇది. దీని గురించి ముందుగానే అమెరికాకు సమాచారం ఇచ్చా. మా దాడులు పరిమితంగా ఉంటాయని చెప్పాం అని వెల్లడిరచారు. సైనిక స్థావరాలే లక్ష్యంగా తాము ప్రతిస్పందించినట్లు చెప్పారు. అయితే తమకు ఎలాంటి ముందస్తు సమాచారం అందలేదని అమెరికా స్పందించడం గమనార్హం..
Tags :