అమెరికా తరువాత రెండోస్థానంలో భారత్
మన దేశ మార్కెట్ల సంపద డీజీపీలో 120 శాతంగా ఉంది. 10 సంవత్సరాల సగటు 87 శాతంగా ఉంటే ఈ రేషియోను మార్కెట్ కొలమానం గా చూస్తారు. ప్రధాన మార్కెట్లుగా ఉన్న అమెరికాలో 155 శాతం, జపాన్ లో 103 శాతం, చైనాలో 81 శాతంగా ఉంది. మన దేశంలో ఇది 120 శాతంగా ఉంది. బొంబై స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ) మార్కెట్ విలువ జనవరి 5 నాటికి 369.33 లక్షల కోట్లుగా ఉంది. 2022, జనవరి 5 నాటికి ఉన్న విలువ 281.95 లక్షల కోట్లతో పోల్చితే ఇది 31 శాతం ఎక్కువ. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం, కార్పొరేట్ సంస్థల ఆదాయాలు మెరుగ్గా ఉండటంతో మార్కెట్ సంపద పెరుగుతున్నదని, ప్రస్తుతం జీడీపీలో మార్కెట్ సంపద చూస్తే పరిస్తితి మెరుగ్గానే ఉందని వెల్త్మెల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్టెటజీ డైరెక్టర్ క్రాంతి భాత్నీ అభిప్రాయపడ్డారు.
Tags :