భారతీయులకు గుడ్ న్యూస్.. సింగపూర్ నుంచి యూపీఐ ద్వారా
సింగపూర్లో ఉంటున్న భారతీయులు ఇకపై యూపీఐ బ్యాంకింగ్ యాప్ల ద్వారా నేరుగా తమ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయొచ్చని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. భీమ్, ఫోన్ఫే, పేటీఎం యూజర్లతో పాటు ఎస్బీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, డీబీఎస్ బ్యాంకుల ఖాతాదారులు రెమిటెన్స్ (విదేశంలో ఉంటున్న వారు స్వదేశంలోని తమ కుటుంబ సభ్యులకు పంపే నగదు) చెల్లింపులు చేయొచ్చు. త్వరలో మరిన్ని బ్యాంకింగ్ యాప్లలో ఈ సర్వీస్ అందుబాటులోకి తీసుకొస్తామని న్పీసీఐ తెలిపింది.
Tags :