ఆస్ట్రేలియన్ సెనేటర్ గా భారత సంతతి వ్యక్తి
ఆస్ట్రేలియన్ సెనేటర్గా భారత సంతతికి చెందిన న్యాయవాది వరుణ్ ఘోష్ భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఆ దేశ పార్లమెంటులో ఇలా భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి వ్యక్తిగా ఘోష్ నిలిచారు. అనారోగ్య కారణాల రీత్యా గతనెల పశ్చిమ ఆస్ట్రేలియన్ స్థానానికి పదవీ విరమణ చేసిన లేబర్ పార్టీ సెనేటర్ పాట్రిక్ డాడ్సన్ స్థానంలో ఆ పార్టీ వరుణ్ ఘోష్ను ఎంపిక చేసింది. ఘోష్ లేబర్ పార్టీ సెనేట్ బృందంలో సభ్యుడు అవడం ఆనందంగా ఉంది. ఆయన తన వర్గం, పశ్చిమ ఆస్ట్రేలియన్లకు బలమైన గళం అవుతారు అని ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి పెన్నీ వాంగ్ పేర్కొన్నారు.
Tags :