యాపిల్ యూజర్లకు కేంద్రం వార్నింగ్
భారత సెక్యూర్టీ అడ్వైజరీ సంస్థ సీఈఆర్టీ-ఇన్ కొత్త వార్నింగ్ జారీ చేసింది. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్, మ్యాక్బుక్, ఐప్యాడ్స్, విజన్ ప్రో హెడ్సెట్లతో హై రిస్క్ ఉన్నట్లు వార్నింగ్లో తెలిపింది. యాపిల్ ఉత్పత్తులకు చెందిన రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్లో లోపాలు ఉన్నట్లు సీఈఆర్టీ పేర్కొన్నది. యాపిల్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్తో పాటు యాపిల్ సఫారీ వర్షన్ 17.4.1, యాపిల్ మ్యాక్ ఓఎస్ వెంచురూ వర్షన్ 13.6.6, యాపిల్ మ్యాక్ సొనోమా వర్షన్ 14.4.1, యాపిల్ వర్షన్ 1.1.1, ఐఓఎస్ 17.4.1 ఐప్యాడ్ వర్షన్ 16.7.7 వర్షన్ల కంటే ముందు వర్షన్లలో సమస్యలు వస్తున్నట్లు కేంద్రం తన వార్నింగ్లో తెలిపింది. ఫోన్లు హ్యాకింగ్కు గురికాకుండా ఉండేందుకు సీఈఆర్టీ పలు కీలక ముందు జాగ్రత్త సూచనలు చేసింది. యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్, మాక్ ఓఎస్, విజన్ ఓఎస్ డివైస్లలో లేటెస్ట్ వర్షన్స్ను అప్డేట్ చేసుకోవాలని సూచించారు.