అదృష్టం అంటే ఇదే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన భారతీయుడు
దుబాయిలో ఓ భారతీయుడికి యూఏఈ లక్కీ డ్రాలో ఏకంగా రూ.45 కోట్లు గెలుచుకొని రాత్రికి రాత్రే ధనవంతుడిగా మారాడు. భారత్కు చెందిన మునావర్ పైరూస్ గత కొన్నేళ్లుగా యూఏఈలో ఉంటున్నాడు. డ్రైవరుగా పనిచేస్తూ అయిదేళ్లుగా ప్రతినెలా లాటరీ టికెట్లను కొనేవాడు. కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబరు 31న నిర్వహించిన బిగ్టికెట్ లైవ్డ్రాలో మునావర్ మెగా ప్రైజ్మనీ విజేతగా నిలిచాడు. ఈయన గెలుచుకున్న 20 మిలియన్ల దిర్హంల విలువ బారతీయ కరెన్సీలో రూ.45 కోట్లు. నాకు ఇప్పటికీ నమ్మశర్యంగా లేదు. లాటరీ టికెటును కొనేందుకు సహకరించిన స్నేహితులతో కలిసి ఈ బహుమతిని పంచుకుంటా అని మునావర్ ఆనందం వ్యక్తం చేశారు.
Tags :