భారత్, యూఎస్ మైత్రీ బంధం మరింత బలోపేతం
ట్రైగర్ ట్రయంఫ్-24 పేరిట నిర్వహిస్తున్న ఇండో`అమెరికన్ సంయుక్త సైనిక విన్యాసాలతో భారత్, యూఎస్ మధ్య పరస్పర సహకారం, మైత్రీ బంధం బలపడుతున్నాయని ఇరు ప్రాంతాల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ సాగర తీరంలో ఇరు దేశాల రక్షణ దళాల సంయుక్త విన్యాసాలు అలరించాయి. కార్యక్రమంలో పాల్గొన్న విశాఖలోని తూర్పు నావికాదళం ప్లాగ్ ఆఫీసర్ రియర్ అడ్మిరల్ రాజేష్ ధన్కర్, జపాన్లోని యూఎస్ నావికా దళం సెవెంత్ ఫ్లీట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైస్ కమాండర్ రియర్ అడ్మిరల్ జోక్విన్ మార్టినెజ్ టైగర్ ట్రయంఫ్ ముఖ్యోద్దేశాన్ని వివరించారు. భారత్, అమెరికా సంయుక్త ఉమ్మడి ఉభయచర, హ్యుమానిటే రియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (హెచ్ఏడీఆర్ ) విన్యాసాలను టైగర్ ట్రయంఫ్ పేరిట మూడో విడతగా ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు విశాఖలో, 27 నుంచి కాకినాడలోనూ ఈ సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.