ASBL NSL Infratech

భారత్, రష్యాల మధ్య కీలక ఒప్పందం

భారత్, రష్యాల మధ్య కీలక ఒప్పందం

తమిళనాడులోని కూడంకుళంలో మరిన్ని అణు విద్యుత్తు యూనిట్లు నిర్మించే కీలక ఒప్పందంపై భారత్‌, రష్యా సంతకం చేశాయి. మాస్కోలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌, రష్యా ఉప ప్రధాని మంతురోవ్‌ పాల్గొన్నారు. కూడంకుళంలో అత్యంత కీలకమైన నిర్మాణాలపై ఒప్పందాలను చేసుకున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కూడంకుళం అణు విద్యుత్తు ప్రాజెక్టును రష్యా సహకారంతో భారత్‌ నిర్మించింది. దాని విస్తరణకు మరోసారి ఒప్పందం కుదిరింది. రక్షణ, అంతరిక్షం, అణు రంగాల్లో సహకరించుకోనున్నామని జైశంకర్‌ తెలిపారు. రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యంపై జనవరిలో చర్చలు జరగనున్నాయని తెలిపారు. 5 రోజుల పాటు రష్యాలో జైశంకర్‌ పర్యటించనున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :