ASBL NSL Infratech

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

2027-28 కల్లా 5 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని, అప్పటికీ డీజీపీ 30 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని తెలిపారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం (ఎఫ్‌డీఐ) విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదం చేసిందని తెలిపారు. 2000 నుంచి 2023 వరకు అంటే 23 ఏళ్లలో భారత్‌కు 919 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు రాగా, ఇందులో 65 శాతం (595 బి.డాలర్లు) గత 8`9 ఏళ్లలోనే వచ్చాయని తెలిపారు. సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా భారత్‌ అడుగులు వేస్తోందని, దేశంలో విద్యుత్‌ వాహనాల వాడకం గణనీయంగా పెరిగిందని తెలిపారు. దేశంలో ప్రస్తుతం 80 శాతం మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :