గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు!
2024 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మెక్రాన్ ను ఆహ్వానించినట్లు కేంద్ర అధికారిక వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ఆహ్వానించినట్లు భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి వెల్లడించారు. అయితే వివిధ కారణాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేనని బైడెన్ చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జులైలో పారిస్లో జరిగే ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ బాస్టిల్ డే పరేడ్ లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ఏడాది సెప్టెంబరులో భారత్ వేదికగా ఢిల్లీలో జీ20 సదస్సులో ఇమ్మానియేల్ మెక్రాన్ పాల్గొన్నారు.
Tags :