ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజామున నుంచే ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీక్షాపరులు స్వామి వారి సన్నిధిలో దీక్షా విరమణ చేశారు. అర్థరాత్రి నుంచి 50 వేల మంది దీక్షాపరులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. 22న ప్రారంభమైన ఈ ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. రేపు కూడా భారీ స్థాయిలో దీక్షా పరులు వచ్చి అంజన్నను దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Tags :