ప్రవాస పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలో ప్రవాస పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. దాదాపు వెయ్యి తెలుగు పద్మశాలి ప్రవాస కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సంప్రదాయ ఉగాది పచ్చడిని తయారు చేసి అందరికి వడ్డించారు. పంచాంగ శ్రవణంతో పాటు సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. యూఏఈ ఇమిగ్రేషన్ అధికారి అల్ అమిరి ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మశాలి సంఘం నేతలు జగదీశ్, శ్రీసాగర్, శ్రీకాంత్, శ్రీనివాస్, సందీప్, సౌజన్య, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
Tags :